BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 05:07 PM
82 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

​వైభవంగా బొల్లారం పోచయ్య కుమార్తె వివాహం

​హాజరైన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు

​ధర్మపురి, మే 13

ధర్మపురి క్షేత్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి దేవస్థాన కమిటీ సభ్యులు బొల్లారం పోచయ్య కుమార్తె శ్వేత, వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామానికి చెందిన సైదం సత్తయ్య కుమారుడు నవీన్ ల వివాహ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

​ఈ వేడుకలో మంత్రి అడ్లూరి పాల్గొని నూతన వధూవరులపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రికి పోచయ్య కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

​హాజరైన ప్రముఖులు:

​మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో కల్యాణ మండపం సందడిగా మారింది.