నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మాధగోని యాదయ్య కుమారుని వివాహ వేడుక శనివారం గుడిమల్కాపురంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లూ సుఖశాంతులతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సాగర్ల బిక్షం
వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, గంగపురం రాము, జన్నారెడ్డి తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు: