BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఊటుకూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
68 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో స్వర్గీయ  విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువూరు ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరై, వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడిగా ఆయనను కొనియాడారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా రంగా సేవలు చిరస్మరణీయమని అన్నారు.

రంగా రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, ఆయన పోరాట పటిమ, యువతలో నింపిన స్ఫూర్తి గురించి సభలో వివరించారు. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా భారీ బహిరంగ సభను గుర్తు చేస్తూ, వేలాది మంది ప్రజలను ఆకట్టుకున్న ఆ సభ ఆయన ప్రజాదరణకు నిదర్శనమని చెప్పారు.

నేటి యువత రంగా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా సమాజ సేవకు అవసరమైన విలువలు అలవడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక, యువజన సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు ఘన నివాళులు అర్పించారు.