BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

ఊటుకూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
14 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో స్వర్గీయ  విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువూరు ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరై, వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడిగా ఆయనను కొనియాడారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా రంగా సేవలు చిరస్మరణీయమని అన్నారు.

రంగా రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, ఆయన పోరాట పటిమ, యువతలో నింపిన స్ఫూర్తి గురించి సభలో వివరించారు. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా భారీ బహిరంగ సభను గుర్తు చేస్తూ, వేలాది మంది ప్రజలను ఆకట్టుకున్న ఆ సభ ఆయన ప్రజాదరణకు నిదర్శనమని చెప్పారు.

నేటి యువత రంగా ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా సమాజ సేవకు అవసరమైన విలువలు అలవడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక, యువజన సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు ఘన నివాళులు అర్పించారు.