www.ntodaynews.com
పాము కాటుతో దుక్కిటెద్దు మృతి.. రైతుకు తీరని నష్టం
తెలంగాణ
/
జనగామ
జనగామ జిల్లా దర్ధపల్లి గ్రామం దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుగులోత్ మూన్య తండ్రి సర్యాకు చెందిన దుక్కిటెద్దు పాము కాటుకు గురై మృతి చెందింది.
రోజువారీగా మేత కోసం వెళ్లిన దుక్కిటెద్దు తిరిగి వచ్చిన అనంతరం పాము కాటుకు గురైనట్లు రైతు తెలిపారు. వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడే ఆ ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మృతి చెందిన దుక్కిటెద్దు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.
పేద రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశువుల నష్టం పెద్ద భారంగా మారుతోందని, అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.