www.ntodaynews.com
పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణలో దరఖాస్తు సమర్పించిన మరీదు శివరామకృష్ణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
జనసేన పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా హాజరైన కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి, నూజివీడు నియోజకవర్గ నేత మరీదు శివరామకృష్ణ తన దరఖాస్తును సమర్పించారు.
ఈ సందర్భంగా నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నూజివీడు టౌన్ నాయకులు కలిసి జయమంగళ వెంకటరమణను కలిసి పార్టీ బలోపేతానికి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.