పెద్ద కాపర్తి రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను ఆయన స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, అతివేగం ప్రాణాలను తీస్తుంది అని ఆయన హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి అని . మలుపులు, ప్రమాదకరమైన కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.