www.ntodaynews.com
పాతకక్షలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. వివాహ వేడుకలో జరిగిన వాగ్వాదం అనంతరం, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై రాళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.