పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘంలో రుణం పొందిన పోతనపల్లి గ్రామానికి చెందిన భూక్య నాగిని మృతి చెందగా, వారి కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా పోలవరం పిఏసియస్ చైర్పర్సన్ యర్రా ప్రసాదరావు బాణావతు లూసికి రూ.10,000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో పోతనపల్లి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధారావతు భాస్కరరావు, చాట్రాయి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోసరాజు సుబ్బారావు (అబ్బులు చౌదరి), ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావురి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధాకర్ రావు, వాణిజ్య విభాగం సెక్రటరీ గుంపుల రాము, జనసేన ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి పాపారావు పాల్గొన్నారు.
అలాగే ధరావతు మంగయ్య, ధరావతు మల్లిఖార్జున రావు, గ్రామ నాయకులు బాణావతు కృష్ణప్రసాద్, 21వ భూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబు, కన్నెగంటి శంకరరావు, ధరావతు మురార్జీ, లావురి వెంకటేశ్వరరావు, బాణావతు రాములు తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.