ప్రజలందరికీ ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ప్రజలందరికీ ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం NTODAY NEWS చిట్యాల
హనుమాన్ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆకాంక్షించారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం వెలిమినేడు శివారులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం దేవస్థాన అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ పాడిపంటలతో, సౌభాగ్యాలతో వెల్లివిరియాలని ఆ అంజనీపుత్రుడిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తిభావం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, ధర్మబద్ధమైన సమాజ నిర్మాణానికి ఆధ్యాత్మికత తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య, ఏఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, అంతటి నరసింహతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.