www.ntodaynews.com
ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్
ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లేఖ
అమరావతి:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రార్థనా స్థలాల్లో శబ్ద పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.