సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ
సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గౌడ బజారులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, చాట్రాయి మండలం మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెలా ఇంటి వద్దకే పెన్షన్ అందజేస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక అండ లభిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.