మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియామకం
మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) యాదయ్య బదిలీ అయ్యారు. ప్రభుత్వ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
యాదయ్య గతంలో మూడేళ్ల క్రితం మహబూబ్నగర్ డీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత 2023 మే 5న బదిలీపై మంచిర్యాల జిల్లాకు వచ్చారు. మంచిర్యాలలో తన పదవీ కాలంలో ఆయన పరిపాలనాపరమైన విషయాలు, విద్యా కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గడచిన మూడేళ్ల కాలంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ అయిన ఆయనకు పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు