కీసర పోలీస్ స్టేషన్కు సీపీ సుమతి
కీసర పోలీస్ స్టేషన్కు సీపీ సుమతి
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి IPS సోమవారం కీసర పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘాను స్వయంగా పరిశీలించిన సీపీ, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ బి.సుమతి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు మరియు అత్యవసర సమయాల్లో 'Mee Suraksha' యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐలు పాల్గొన్నారు.