BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

​స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు భారీ జరిమానా

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
05 Aug, 2026 - 01:59 PM
313 వీక్షణలు

​​స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు భారీ జరిమానా 

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శివగంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం  ఏభై రెండు లక్షల పదకొండు వేల రూపాయలు  పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. ​చిట్యాల మండలం వట్టిమర్రి గ్రామానికి చెందిన నూనే శ్రవణ్‌కుమార్, 2024 ఏప్రిల్ 15న తన స్నేహితులతో కలసి చిట్యాల శివారులో ఉన్న శివగంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో శ్రవణ్‌కుమార్‌కు తలకు తీవ్ర గాయమై నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీసి నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ​ఈ దుర్ఘటనపై మృతుడి తండ్రి నూనే సంజీవ చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు పాటించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విచారణలో తేలింది. ​బాధిత కుటుంబం న్యాయం కోసం నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. న్యాయవాదులు శేపూరి మధుసూదన్, ఎస్. పూర్ణచందర్‌లు బాధిత కుటుంబం తరఫున రూ. 50,00,000/- పరిహారం ఇప్పించాలని వాదనలు వినిపించారు.

​ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్ శ్రీ మామిడి క్రిస్టోఫర్, సభ్యులు సంధ్యారాణి, వెంకటేశ్వర్లు.. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 52,11,000/- లను 45 రోజులలోపు చెల్లించాలని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.