స్వర్ణకార కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి: కూనూరు సంజయ్ దాస్ గౌడ్
NTODAY NEWS చిట్యాల
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఒక ప్రకటనలో స్వర్ణకారులు మరియు అనుబంధ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం ధరల పెరుగుదల, యంత్రాల వినియోగం మరియు పనుల కొరత వల్ల వేలాది మంది స్వర్ణకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారూ. ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో, కుదేలైన ఈ రంగానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ మరియు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి అని, ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, మరియు వృద్ధులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు సంప్రదాయ వృత్తి పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేసి, నైపుణ్యాభివృద్ధికి ఆధునిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి పేర్కొన్నారు. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న స్వర్ణకారుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.