శ్రీరాములపల్లిలో వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం
శ్రీరాములపల్లిలో వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో బుధవారం నూతన గృహ ప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారురాలు పొనగంటి సుగుణ రాజనర్సయ్య నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో గ్రామంలో అర్హులకు ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు