చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయక అవగాహన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని వెన్నెల స్కూల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను వివరించారు. ఆయన ధైర్యసాహసాలు, దూరదృష్టి, స్వరాజ్య స్థాపనలో చూపిన నాయకత్వం, స్త్రీల పట్ల గౌరవం, గురుభక్తి, దేశభక్తి వంటి ఆదర్శప్రాయమైన గుణాలను విద్యార్థులకు తెలియజేశారు. శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యవాహ కట్టా శివ గణేష్, ఖండ కార్యవాహ రావిపాటి సతీష్, చింతలపూడి మండల కార్యవాహ తంటేపూడి వరప్రసాద్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.