BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

టీజీ ఐసెట్-2026కు పరీక్షకు సర్వం సిద్ధం

తెలంగాణ
/ నల్గొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
11 May, 2026 - 06:23 PM
81 వీక్షణలు

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

*​రాష్ట్రవ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు : ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి

NTODAY NEWS నల్గొండ జిల్లా 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్-2026 పరీక్షలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 13, 14 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైందని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి వెల్లడించారు. ఈ పరీక్షకు 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ​ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 56,223 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ఇందులో 30,308 మంది మహిళా అభ్యర్థులు కాగా, 25,915 మంది పురుషులు ఉన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ వ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లు, 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 100 మంది ప్రత్యేక పరిశీలకులను  నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. ​మే 13: రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.​మే 14 న ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు​ ఉదయం సెషన్  8:30 గంటల నుంచి , మధ్యాహ్నం సెషన్ వారిని 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9:45 గంటల తర్వాత, మధ్యాహ్నం 1:45 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ​పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. దివ్యాంగులు మరియు ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. ఎంజీయూకు వరుసగా రెండోసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలు రావడంతో, అధికారులు మరింత అప్రమత్తంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, పరీక్షా కేంద్రాలకు గంటన్నర ముందుగానే చేరుకోవాలని ఆచార్య అల్వాల రవి కోరారు.