తెల్లవారుజామున తొలి ఇమేజింగ్ శాటిలైట్ ప్రయోగం
శ్రీహరికోట నుంచి GSLV-F17 ప్రయోగం.. EOS-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో
శ్రీహరికోట | Ntoday News
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ను ప్రయోగించనుంది.
ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ **‘EOS-05’**ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న తొలి ఇమేజింగ్ శాటిలైట్గా EOS-05 నిలవనుందని సమాచారం.
EOS-05 ఉపగ్రహం భూమిని నిరంతరం పరిశీలిస్తూ అధిక నాణ్యతతో చిత్రాలను సేకరించనుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, భూ పరిణామాలు తదితర అంశాలపై కీలక సమాచారాన్ని అందించడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
కాగా, GSLV-F17 ప్రయోగం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) సిరీస్లో 19వ ప్రయోగంగా నిలవనుంది. ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.