BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 09:58 PM
12 వీక్షణలు

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు.. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేక వెసులుబాటు

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలతో జీవో విడుదల చేసింది.

కొత్త జీవో ప్రకారం అర్హత కలిగిన భారీ బడ్జెట్ సినిమాలకు నియంత్రిత విధానంలో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. అలాగే రోజుకు గరిష్ఠంగా ఐదు షోలకు అనుమతి ఇవ్వనున్నారు.

అయితే సాధారణ ప్రేక్షకులపై భారం పడకుండా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్‌-ప్రేమియం కేటగిరీకి కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సినిమా చూసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగం, చిన్న సినిమాల అభివృద్ధి, సినీ రంగ కార్మికుల సంక్షేమానికి ఊతం లభిస్తుందని తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది.

సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకుల ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేసేలా కొత్త విధానం రూపొందించామని ప్రభుత్వం తెలిపింది.