BREAKING
మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
www.ntodaynews.com

ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం

తెలంగాణ
26 Dec, 2025 - 09:26 AM
174 వీక్షణలు

ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం

-ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు NTODAY NEWS : చిట్యాల ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్ అన్నారు. సిపిఐ 100 వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా ఆ పథకం పేరు మార్చడం జరుగుతుందని పెట్టుబడి దారి విధానానికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా సిపిఐ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దేశగోని బాలరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, పట్టణ కార్యదర్శి ఎస్కె షరీఫ్, దేవేందర్, దండిగా నరసింహ, రావుల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube