BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే

తెలంగాణ
01 Oct, 2024 - 01:31 AM
195 వీక్షణలు
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జండగే అన్నారు.సోమవారం నాడు జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నిరంతరం చేపట్టే అభివృద్ధి పథకాలు, ప్రజల మేలు కోరే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో, వాటి ప్రాముఖ్యతను తెలియచెప్పడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర ఎనలేనినదని, జిల్లా యంత్రాగంతో, మీడియాతో అనుసంధానంగా ఉండి అలాంటి పబ్లిక్ రిలేషన్స్ బాధ్యతను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు నిర్విఘ్నంగా నెరవేర్చారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు క్షేత్రస్థాయి నుండి అద్వితీయ పాత్ర పోషిస్తూ జిల్లాను ముందంజలో నిలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, మీడియా ప్రతినిధులు, రాష్ట్ర గజిటెడ్ ఉద్యోగుల సంఘం ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.