BREAKING
పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు?
www.ntodaynews.com

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే

తెలంగాణ
01 Oct, 2024 - 01:31 AM
119 వీక్షణలు
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జండగే అన్నారు.సోమవారం నాడు జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం నిరంతరం చేపట్టే అభివృద్ధి పథకాలు, ప్రజల మేలు కోరే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో, వాటి ప్రాముఖ్యతను తెలియచెప్పడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర ఎనలేనినదని, జిల్లా యంత్రాగంతో, మీడియాతో అనుసంధానంగా ఉండి అలాంటి పబ్లిక్ రిలేషన్స్ బాధ్యతను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు నిర్విఘ్నంగా నెరవేర్చారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు క్షేత్రస్థాయి నుండి అద్వితీయ పాత్ర పోషిస్తూ జిల్లాను ముందంజలో నిలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, మీడియా ప్రతినిధులు, రాష్ట్ర గజిటెడ్ ఉద్యోగుల సంఘం ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.