BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
117 వీక్షణలు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఆస్తుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో భూమి పేరు మార్పిడి కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులకు చెక్ పడనుంది.

పాత విధానానికి గుడ్‌బై

ఇప్పటి వరకు కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారసులు భూమిని తమ పేర్లకు మార్చుకోవాలంటే ప్రత్యేకంగా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడం, అవసరమైన పత్రాలు సమర్పించడం, నెలల తరబడి ఎదురు చూడడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కారణంగా రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు పడేవారు.

కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?

ఇకపై వారసత్వ ఆస్తుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలు స్వయంచాలకంగా రెవెన్యూ శాఖకు చేరతాయి. అనంతరం రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదు అవుతాయి. దీంతో మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

స్టాంప్ డ్యూటీలో భారీ ఊరట

రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూముల బదలాయింపులకు కేవలం రూ.100 స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లించేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

వీలునామా లేకపోతే ఎఫ్ఎంసీ తప్పనిసరి

కుటుంబ పెద్ద వీలునామా రాయకపోయిన సందర్భాల్లో, వారసత్వ హక్కుల నిర్ధారణ కోసం రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ (ఎఫ్ఎంసీ) సమర్పించడం తప్పనిసరి చేసింది. దీంతో భవిష్యత్తులో ఆస్తి వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు భారీ ఊరట

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల భూముల పేరు మార్పిడి ప్రక్రియ వేగవంతం కానుండగా, రైతులు మరియు వారసులు అనవసరమైన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మార్చే దిశగా ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.