www.ntodaynews.com
వైసీపీ నేత జగ్గవరపు జానకి రెడ్డి మృతికి చింతలపూడి టీడీపీ నాయకుల సంతాపం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల చింతలపూడి మండల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
జగ్గవరపు జానకి రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నేత జగ్గవరపు ముత్తారెడ్డి ఆధ్వర్యంలో పరామర్శించిన టీడీపీ నాయకులు, ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జానకి రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.