BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

విద్యార్థుల వీడియోకు వెంటనే స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. బీసీ హాస్టల్ రహదారి సమస్య పరిష్కారానికి హామీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 07:39 PM
15 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు, జూలై 3: జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సమీప బీసీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వీడియో సందేశం ద్వారా ఏలూరు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.

విద్యార్థుల సమస్యపై ఆరా తీసిన ఎంపీ, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్‌కు ఫోన్ చేసి, హాస్టల్ వద్ద పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. దీంతో కొండ్రెడ్డి కిషోర్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, మున్సిపల్ కమిషనర్ కె. వెంకటరమణ, ఎమ్మార్వో జోజి తదితర అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం బీసీ హాస్టల్‌ను సందర్శించారు.

హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లే మట్టిరహదారిని పరిశీలించిన అధికారులు, వర్షాలు కురిసినప్పుడు అది పూర్తిగా బురదమయంగా మారి విద్యార్థులు నడవలేని పరిస్థితి ఏర్పడుతోందని గుర్తించారు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా మారిన దృశ్యాలను కొండ్రెడ్డి కిషోర్ బృందం ఫోన్ ద్వారా ఎంపీకి వివరించింది.

దీనిపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున వర్షాలు తగ్గిన వెంటనే ముందుగా గ్రావెల్‌తో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయించి, విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తమ సమస్యను వెంటనే గుర్తించి స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, అధికారులకు బీసీ హాస్టల్ విద్యార్థులు, వార్డెన్ కృతజ్ఞతలు తెలిపారు.