BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

వర్షాకాలంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి పెనుగొలనులో 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:40 PM
139 వీక్షణలు

పెనుగొలను, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం 104 సంచార ఆరోగ్య వాహన వైద్య శిబిరం నిర్వహించారు.

వైద్య అధికారిణి శశిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, జ్వరం తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వైద్య అధికారిణి శశిప్రియ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జ్వరం, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ బి.హెచ్. సురేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా, ఏఎన్ఎం రత్నమాల, ఎంపీహెచ్ఏ పుల్లారావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.