www.ntodaynews.com
వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
పిడుగురాళ్లలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.