www.ntodaynews.com
ఆదాయానికి మించి ఆస్తులు.. ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు
తెలంగాణ
/
రంగారెడ్డి
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు.
ఆయనకు సంబంధించిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సోదాలు పూర్తయిన అనంతరం ఆస్తుల వివరాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.