BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం.....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
26 Aug, 2026 - 07:26 PM
5 వీక్షణలు

పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం

మేడికొండూరు: వర్షాభావ పరిస్థితులతో పంట కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు సొంత ఖర్చులతో నీటిని పొలాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన సాంబయ్య 3.5 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటకు నీరు అందించేందుకు గ్రామంలోని ఊరచెరువు నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి, మోటారు సహాయంతో నీటిని పొలాలకు తరలిస్తున్నారు. ఒక్కో పైపునకు రూ.1,500 చొప్పున మొత్తం 253 పైపులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఇదే గ్రామానికి చెందిన మరో రైతు గజానంద్ రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటకు నీటి తడులు అందించేందుకు సొంతంగా ఖర్చు చేస్తూ నీటిని పొలాలకు తరలిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇలా వేలాది రూపాయలు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట కాలువలకు సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.