కంభంపాడు, చీమలపాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ
కంభంపాడు, చీమలపాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై అధికారులకు సూచనలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం పరిశీలించారు.
ఏ.కొండూరు మండలంలోని కంభంపాడు, చీమలపాడు గ్రామాల్లో జరుగుతున్న హీరింగ్స్, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన ఆర్డీఓ హీరింగ్స్, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణల ప్రక్రియపై వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేసి ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.