www.ntodaynews.com
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు సీపీఎం నేతల పరిశీలన..
మేడికొండూరు: పెరిచెర్లలోని జగనన్న కాలనీలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని సీపీఎం నగర కార్యదర్శి నల్లినీకాంత్ తెలిపారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతగా లేకపోవడంతో లబ్ధిదారులు నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు.
కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీపీఎం నాయకులు బుధవారం పెరిచెర్లలోని జగనన్న కాలనీని పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.