ఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డు ఈ-కేవైసీ ఇక ఫోన్లోనే.. 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను స్మార్ట్ఫోన్ ద్వారా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ‘మేరా ఈ-కేవైసీ’, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్లను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలి.
ఈ-కేవైసీ విధానం:
‘మేరా ఈ-కేవైసీ’ యాప్ను తెరవాలి.
రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవాలి.
ఆధార్ నంబర్, ఓటీపీ, తెరపై కనిపించే అక్షరాలు, సంఖ్యలను నమోదు చేయాలి.
అనంతరం ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి.
ప్రక్రియ విజయవంతమైతే తెరపై విజయవంతం అనే సందేశం కనిపిస్తుంది.
ఇంటివద్ద నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉండటంతో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.