తిరువూరులో ఘనంగా మాధవ్–శిరి చందనల రిసెప్షన్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం కాకర్ల గ్రామంలోని ఏజీఎస్ కన్వెన్షన్లో పోట్రు హరిప్రసాద్ కుమారుడు మాధవ్, శిరి చందనల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.