BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 03 September 2026, 06:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 06:30 AM
27 వీక్షణలు

కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధ్యం: మొండ్రు సురేష్

నూజవీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ:

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చనుబండ పంచాయతీ పరిధిలో మొండ్రు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చనుబండ సెంటర్‌లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొండ్రు సురేష్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నిరుపేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాల బాటలో తామంతా పయనిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగాలంటే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించాలంటే కూటమి శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. సమన్వయం లేకుండా ఎవరికి వారు వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి నష్టం కలిగే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని మొండ్రు సురేష్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విస్సంపల్లి రాజా, బొజ్జూరి గోపి, మేడ చింటూ, రత్నా రాజు, దేశిన సాయి, ఎస్‌కే రియాజ్, అడిమెల్లి ప్రసాద్, మిద్దె కిట్టితో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.