లక్ష్మిపురంలో ఎంపీ కేశినేని చిన్ని సన్మానం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు: విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) తిరువూరు పట్టణ, మండల పర్యటనలో భాగంగా లక్ష్మిపురం జాతీయ రహదారి సమీపంలోని కందిమళ్ల శేషగిరిరావు ఫాంహౌస్లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు కేశినేని శివనాధ్ను శాలువాతో సత్కరించి, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీతో కమిటీ సభ్యులు ఆత్మీయంగా మాట్లాడారు.
కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్.ఆర్.కె. చారి, విశ్వనాధుని మాధవాచారి, బండారు శ్రీనివాసాచారి, ఎస్.ఎన్.బి. చారి తదితరులు పాల్గొన్నారు.