BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఆర్టీఐ వివరాలు ఇవ్వని ఎంఈవోకు జరిమానా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:19 PM
83 వీక్షణలు

హయత్నగర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలను నిర్ణీత గడువులో అందించకపోవడంతో హయత్నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఆదేశాలు జారీ చేశారు.

హయత్నగర్‌కు చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్‌బాబు చొల్లేటి ఎంఈవో కార్యాలయం నుంచి కొన్ని వివరాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే గడువు ముగిసినా సమాచారం అందించకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

శనివారం జరిగిన విచారణలో దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషన్ నిర్ధారించింది. దీంతో రూ.5 వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని ఎంఈవో అక్కడికక్కడే ఫోన్‌పే ద్వారా చెల్లించారు.

సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులకు ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.