కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు.. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు
తిరుమల: టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు సోమవారం కుటుంబ సమేతంగా ను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆశీర్వచనం అందించగా, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ, శ్రీవారి కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. రైతులు, యువత, మహిళలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని, రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
మువ్వా విజయబాబు తిరుమల పర్యటన సందర్భంగా పలువురు భక్తులు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.