BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయం: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగ లక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
06 Jul, 2026 - 01:44 PM
86 వీక్షణలు

బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయం: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగ లక్ష్మి 

​ధర్మపురి, జూలై 6: భారత మాజీ ఉప ప్రధాని, గొప్ప సంఘ సంస్కర్త, దళిత హక్కుల పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి గారు మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక ధ్రువతార అని కొనియాడారు. "దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం మరియు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. దేశ నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమైనవి. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగాలి" అని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.