BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయం: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగ లక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
06 Jul, 2026 - 01:44 PM
53 వీక్షణలు

బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయం: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగ లక్ష్మి 

​ధర్మపురి, జూలై 6: భారత మాజీ ఉప ప్రధాని, గొప్ప సంఘ సంస్కర్త, దళిత హక్కుల పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి గారు మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక ధ్రువతార అని కొనియాడారు. "దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం మరియు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. దేశ నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమైనవి. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగాలి" అని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.