ఆర్టిజన్లకు న్యాయం చేయాలి
ఆర్టిజన్లకు న్యాయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్
మంచిర్యాల:
తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు.
శనివారం మంచిర్యాలలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడాలని హితవు పలికారు. కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు అన్ని విధాలా అండగా నిలిచామని, వారి సంక్షేమానికి పెద్దపీట వేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మొండివైఖరి వీడి, ఆర్టిజన్ల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు