సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో, ఆదివారం రాత్రి రాష్ట్ర ఆబ్కారీ - మద్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు.
నస్పూర్ మండలం సి.సి.సి. లోని సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న మంత్రికి జిల్లా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డి.సి.పి. ఎ.భాస్కర్ లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి (ఆర్డీఓ) శ్రీనివాసరావు, ఎ.సి.పి. ప్రకాష్ లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు