BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 May, 2026 - 08:49 PM
60 వీక్షణలు

చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

​గురువులను సన్మానించిన 2008-09 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు

​మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ స్నేహితులు

వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం (31-05-2026) నాడు 2008-2009 ఎస్‌ఎస్‌సీ (SSC) బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆత్మీయ వాతావరణంలో జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు.

​ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను, నాటి స్నేహాలను నెమరువేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు. ప్రస్తుతం తాము వివిధ రంగాలలో సాధించిన విద్యా, ఉద్యోగ, వ్యాపార విజయాలను, తమ కుటుంబ జీవిత విశేషాలను పరస్పరం పంచుకున్నారు.

​ఈ ఆత్మీయ కలయిక పట్ల ఉపాధ్యాయులు స్పందిస్తూ.. ఎంతో కాలం తర్వాత విద్యార్థులంతా ఒకే చోట చేరి పాత జ్ఞాపకాలను పంచుకోవడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు సంతోషం కుమార్, లక్ష్మీరాజాం, రామయ్య, ఇళ్ల ఉద్దిన్, మనోహర్, వసంతరావు, చిలుకయ్య, తిరుపతి, సుజాత, గిరీజదేవి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.