www.ntodaynews.com
అడవి పంది వేటకు యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్
తెలంగాణ
/
వరంగల్
అడవి పంది వేటకు యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్
వరంగల్ జిల్లా, జూలై 19: నర్సంపేట మండలం రామవరం శివారు అటవీ ప్రాంతంలో ఉచ్చులు, బోనులతో అడవి పందిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని అటవీ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి వేటకు ఉపయోగించిన సామగ్రితో పాటు ఘటనాస్థలానికి వచ్చిన మూడు మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బారి నుంచి ఒక అడవి పందిని సురక్షితంగా రక్షించారు.
నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.