BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 28 March 2026, 08:26 pm
Posted by : V శ్రీనివాస్

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 08:26 PM
126 వీక్షణలు

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య

లక్సెట్టిపేట, మార్చి 28:

లక్సెట్టిపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం సాయంత్రం లక్సెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు, అలాగే స్థానికంగా వసూలయ్యే పన్నుల ద్వారా వచ్చే నిధులను మున్సిపాలిటీలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు చర్చించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు, బడ్జెట్ కేటాయింపులకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు