BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 08:26 PM
53 వీక్షణలు

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య

లక్సెట్టిపేట, మార్చి 28:

లక్సెట్టిపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం సాయంత్రం లక్సెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు, అలాగే స్థానికంగా వసూలయ్యే పన్నుల ద్వారా వచ్చే నిధులను మున్సిపాలిటీలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు చర్చించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు, బడ్జెట్ కేటాయింపులకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు