అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి
అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య
లక్సెట్టిపేట, మార్చి 28:
లక్సెట్టిపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం సాయంత్రం లక్సెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు, అలాగే స్థానికంగా వసూలయ్యే పన్నుల ద్వారా వచ్చే నిధులను మున్సిపాలిటీలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు చర్చించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు, బడ్జెట్ కేటాయింపులకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు