www.ntodaynews.com
ఏ.కొండూరు తహసిల్దార్గా వైకుంఠరావు నియామకం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఏ.కొండూరు, ఆగస్టు 29: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండల నూతన తహసిల్దార్గా వైకుంఠరావు నియమితులయ్యారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న వైకుంఠరావును ఏ.కొండూరు తహసిల్దార్గా నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
రెవెన్యూ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన వైకుంఠరావు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నేతృత్వంలో మండలంలో రెవెన్యూ సేవలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.