www.ntodaynews.com
హైదరాబాద్లో అంబటి రాంబాబుకు గుండె చికిత్స....
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లో అంబటి రాంబాబుకు గుండె చికిత్స.. రెండు నాళాల్లో పూడిక గుర్తింపు
స్టెంట్ వేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని హైదర్గూడ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అంబటి రాంబాబు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాల్లో పూడిక ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో వైద్యులు వెంటనే చికిత్స అందించి స్టెంట్ వేశారు.
ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిసింది. ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.