BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

900 మంది విద్యార్థులతో అమ్మ భాష తెలుగు వినూత్న ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
29 Aug, 2026 - 11:08 AM
13 వీక్షణలు

900 మంది విద్యార్థులతో ‘అమ్మ భాష తెలుగు’ వినూత్న ప్రదర్శన

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుప్పం నోబెల్ స్కూల్ వీడియో

కుప్పం | NTODAY News 

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని నోబెల్ స్కూల్లో 900 మంది విద్యార్థులతో నిర్వహించిన వినూత్న ప్రదర్శన ఆకట్టుకుంది. కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) ఆధ్వర్యంలో విద్యార్థులు “అమ్మ భాష తెలుగు” అనే సందేశాన్ని వినూత్న రీతిలో ప్రదర్శించారు.

తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యతను చాటిచెప్పేలా విద్యార్థులంతా సమన్వయంతో ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చేసిన ఈ ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిమానం పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.

వినూత్న రీతిలో తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థుల ద్వారా ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని నోబెల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు మాతృభాషపై అభిమానం పెంపొందించే కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.