BREAKING
పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
Date of Publish : 09 September 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు: జడ్పీ సీఈఓ కార్యాలయంలో ఏసీబీ వల.. జూనియర్ అసిస్టెంట్ పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:20 PM
12 వీక్షణలు

ఏలూరు: అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏలూరులో వల పన్ని జడ్పీ సీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. మాతంగి పవిత్రన్ జడ్పీ సీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఒక పని నిమిత్తం రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం సాయంత్రం పక్కా ప్రణాళికతో వల పన్ని లంచం తీసుకుంటున్న సమయంలో పవిత్రన్‌ను పట్టుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏసీబీ అధికారులు ట్రాప్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. లంచం డిమాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నగదు స్వాధీనం, కేసు నమోదు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ట్రాప్ పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.