BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

​ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ (మైనింగ్) సీటు సాధించిన భైరపాక దవల్ జఫ్రీకి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అభినందనలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 09:12 PM
58 వీక్షణలు

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ (మైనింగ్) సీటు సాధించిన భైరపాక దవల్ జఫ్రీకి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అభినందనలు

మంచిర్యాల పట్టణానికి చెందిన భైరపాక దవల్ జఫ్రీ జేఈఈ అడ్వాన్స్డ్-2026లో అఖిల భారత స్థాయిలో 2301వ ర్యాంకు సాధించి, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మైనింగ్ విభాగంలో బీటెక్ సీటు సాధించాడు.

​దవల్ జఫ్రీ తండ్రి ఐజక్ అనిల్ కుమార్ ఆర్‌జీహెచ్‌పీ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, తల్లి దమయంతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆయన, అనంతరం ఆల్ ఫోర్స్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్లో తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు.

​ఈ నెల 21న దవల్ జఫ్రీ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లనున్న సందర్భంగా ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యం ఆదివారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు దవల్ జఫ్రీని ఘనంగా సన్మానించి రివార్డు అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాల విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ దాసరి శ్రీనివాస్, గణిత అధ్యాపకుడు కిరణ్ కుమార్, అధ్యాపక బృందం, డాక్టర్ జయరావు, విద్యార్థి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు