గొల్లపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ర్యాలీ
గొల్లపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ర్యాలీ
జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ముస్కు శ్యాం సుందర్ గార్డెన్ వరకు ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, వేలాది మంది రైతులతో సాగింది.
ఈ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ... "ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రుణమాఫీ, రైతుబంధు, పంటల మద్దతు ధరల విషయంలో రైతులను దారుణంగా మోసం చేసింది. 1000 రోజులు గడిచినా రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోంది" అని మండిపడ్డారు. రైతుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మరియు గొల్లపల్లి మండల పరిధిలోని గ్రామాల నుండి తరలివచ్చిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.