www.ntodaynews.com
అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అమడగూరు, ఆగస్టు 14: పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలంలో ఎంపీడీఓ శకుంతలమ్మ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎంపీడీఓ శకుంతలమ్మ సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ జిలాన్ భాష, ఏపీఎం భారతి, ఏవో మల్లికార్జునరెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి – రామాంజనేయులు